ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 04:48 PM

మావోయిస్టు పార్టీకి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ ఇన్‌చార్జి మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (51) ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జీఎంవలస వద్ద బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు.ఐఈడీలు, మందుపాతరల తయారీలో టెక్ శంకర్ దిట్టగా పేరుపొందారు. ఇటీవల హతమైన అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన అనేక దాడులకు ఈయనే సాంకేతిక సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి (ఉదయ్) మరణించడంతో, పార్టీ పునర్నిర్మాణం కోసం కేంద్ర కమిటీ శంకర్‌ను ఏవోబీకి పంపింది. కీలక సమయంలో ఆయన మృతి చెందడం పార్టీకి కోలుకోలేని నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa