ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు పోలవరం సహా పలు ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 12:51 PM

ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల సాధనే లక్ష్యంగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, ఇతర పథకాలకు నిధుల విడుదల, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఏపీకి నీటి భద్రత చాలా కీలకమని, ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ అమలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన రూ.524.41 కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను విడుదల చేయాలని కోరారు. అలాగే పీఎం కృషి సించాయి యోజన కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa