ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవానీ దీక్షల ఇరుముళ్లు చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 09:49 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు వరుస అపచారాలకు వేదికలుగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయన మాట్లాడుతూ....  “భవానీ దీక్షల ఇరుముళ్లు గురువులు విప్పాల్సిన పవిత్ర ఆచారం. అలాంటిది చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు? ఇది స్పష్టమైన అపచారం. కనకదుర్గ ఆలయ పాలక మండలి సంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తోంది” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు అమ్మవారి దేవాలయాన్ని చీకట్లో ఉంచడం, భక్తులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.ఆలయంలో పాలల్లో పురుగులు రావడం, అమ్మవారి గుడి ప్రాంగణంలో కేక్‌ కట్‌ చేయడం, అన్నప్రసాదం వద్ద భక్తుడికి కరెంట్‌ షాక్‌ తగలడం వంటి ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు. “దేవాదాయ శాఖ ఉన్నా, విద్యుత్ శాఖ ఉన్నా ఇవన్నీ ముఖ్యమంత్రి పరిధిలోకే వస్తాయి. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa