వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కమిటీలు, అనుబంధ విభాగాల్లో నియమకాలు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో మండల, బూత్ స్థాయిల్లో అన్ని కమిటీలను, అలాగే అనుబంధ విభాగాల నియామకాలను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు.కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన సంస్థాగత నిర్మాణం అత్యంత అవసరమని దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గంలో ప్రతి బూత్లో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa