వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాల్సిందేనని, గ్రామ స్థాయి కమిటీలే పార్టీకి పునాదులని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్టీకి నిబద్ధతగా, నిరంతరం పనిచేసే కార్యకర్తలనే గ్రామ కమిటీల్లో నియమించాలని ఆయన సూచించారు. సోమవారం సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షులు (ఇన్చార్జ్), జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాములు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ, “పార్టీ వృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తల ఆలోచనలే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తాయి. పార్టీ భవిష్యత్ పూర్తిగా కార్యకర్తల చేతుల్లోనే ఉంది. మీరే పార్టీ దిశా నిర్దేశకులుగా నిలిచి, ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలి” అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa