ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 10:04 AM

ప్రజా సమస్యలపై బలంగా పోరాడేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకం అని కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రతి కార్యకర్తకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించడం ద్వారా ప్రజల సమస్యలపై సమర్థంగా పోరాడగలమని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర స్థాయి ఎస్ఈసీ , సీఈసీ సభ్యులు, అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa