భారత క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లకు పద్మశ్రీ లభించింది.క్రీడా రంగం నుంచి మరికొందరు ప్రముఖులు కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్కు దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది. అదేవిధంగా, భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి సవిత పూనియాకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు.2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కళలు, సామాజిక సేవ, క్రీడలు, సైన్స్, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి క్రీడా రంగానికి చెందిన పలువురికి పద్మ పురస్కారాలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa