చిన్నారుల ఎదుగుదలలో పళ్లు రావడం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. సాధారణంగా శిశువులకు 7 నుంచి 9 నెలల వయసు మధ్యలో పాలదంతాలు రావడం మొదలవుతుంది. ఈ సమయంలో పిల్లలు చిగుళ్ల నొప్పితో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, తల్లిదండ్రులు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో అవసరమని శిశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మొదటి పన్ను కనిపించినప్పటి నుంచే నోటి శుభ్రతను అలవాటు చేయాలి. పళ్లు రావడం ప్రారంభమైన వెంటనే, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మృదువైన బ్రష్ను ఉపయోగించి వాటిని సున్నితంగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్లపై పాచి పేరుకుపోకుండా ఉంటుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం ద్వారా భవిష్యత్తులో దంత సమస్యలు రాకుండా ముందుగానే అరికట్టవచ్చు.
దంతాలు వచ్చే సమయంలో చిగుళ్లలో దురద, నొప్పి కలగడం సహజం. ఈ ఇబ్బంది నుండి ఉపశమనం కలిగించడానికి ఒక శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తీసుకుని, దానిని కాసేపు ఫ్రిజ్లో ఉంచి చల్లబరచాలి. ఆ చల్లని క్లాత్ను పసిపిల్లలకు ఇస్తే, వారు దానిని నమలడం ద్వారా చిగుళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. ఇది వారికి ఎంతో హాయిని ఇస్తుంది మరియు చిరాకును తగ్గిస్తుంది.
పళ్లు వచ్చే క్రమంలో కొంతమంది పిల్లల్లో జ్వరం రావడం లేదా విరేచనాలు (మోషన్స్) అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా పిల్లాడు బాగా నీరసించిపోయినా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, మందులు తీసుకోవడం ద్వారా పసిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa