ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, ఈయూ మధ్య ఒప్పందం అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిది

national |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 03:15 PM

భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అభివర్ణించారు. ఈ ఒప్పందం ఖరారైతే ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ, సేవా రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని, ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. "భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదరబోతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చర్చిస్తున్నాయి. ఈ డీల్ 140 కోట్ల మంది భారతీయులకు, యూరప్‌లోని లక్షలాది ప్రజలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది" అని మోదీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa