ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలని హతమార్చిన ప్రియుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 02:36 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని అయిన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తల నరికి, మొండెం నుంచి వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.ఆగ్రాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో వినయ్ సింగ్ (30) అకౌంటెంట్‌గా, మింకీ శర్మ (32) హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పెళ్లి చేసుకోవాలని వినయ్ కోరగా మింకీ నిరాకరించింది. మరో వ్యక్తితో ఆమె మాట్లాడుతోందని వినయ్ అనుమానించాడు. ఈ క్రమంలో జనవరి 23న ఆఫీసుకు పిలిచి గొడవపడి కత్తితో దాడి చేసి హత్య చేశాడు.అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తలను ఓ బ్యాగులో, మొండెం, కాళ్లను మరో గోనెసంచిలో కుక్కాడు. మృతదేహాన్ని యమునా నదిలో పడేసేందుకు మింకీ స్కూటర్‌పైనే జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. కానీ గోనెసంచి బరువుగా ఉండటంతో దానిని అక్కడే వదిలేసి, తలను మాత్రం సమీపంలోని ఓ కాలువలో పడేసి పారిపోయాడు. మింకీ కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, 100కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడిగా వినయ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.ఆగ్రా డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ ఈ వివరాలను ధ్రువీకరించారు. నిందితుడు వినయ్ సింగ్ నేరాన్ని అంగీకరించాడని, పెళ్లికి నిరాకరించడం వల్లే హత్య చేసినట్లు తెలిపాడని ఆయన పేర్కొన్నారు. పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మింకీ తల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa