టీ20 వరల్డ్కప్ 2026లో గ్రూప్ దశలో భారత్తో ఆడాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ తన ఎక్స్లో వెల్లడించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్ ఆడదని ఆదేశాలు జారీ చేసింది. కారణం మాత్రం చెప్పలేదు. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని, ఎలాంటి గందరగోళానికి తావులేదని, ఒక్క మ్యాచ్ను బహిష్కరించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీసీ స్పష్టం చేసింది. పాకిస్థాన్ లెక్కచేయకపోతే భారీ జరిమానాలు, నిషేధాలు వంటి కఠిన చర్యలు ఉండే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa