ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధి ఖాతాలను Employees' Provident Fund Organisation నిర్వహిస్తోంది. ఒకప్పుడు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలన్నా, అడ్వాన్స్ తీసుకోవాలన్నా నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం సేవలు పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.ఈ డిజిటల్ సేవలను అంతరాయం లేకుండా వినియోగించుకోవాలంటే యూఎఎన్ (UAN) నంబర్కు ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలామంది ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. కానీ ఆధార్ లింక్ లేకపోతే అత్యవసర సమయంలో పీఎఫ్ క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో యజమాని కంట్రిబ్యూషన్ లేదా వడ్డీ జమ కావడంలో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు.యూఎఎన్–ఆధార్ అనుసంధానం చేసే ముందు వివరాలు సరిపోలడం అత్యంత ముఖ్యం. పీఎఫ్ ఖాతాలో ఉన్న పేరు, ఆధార్లోని పేరుతో స్పెల్లింగ్ సహా ఒకేలా ఉండాలి. ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ అవసరం అవుతుంది. లింగ వివరాలు కూడా రెండు చోట్ల ఒకే విధంగా ఉండాలి.ఈ ప్రక్రియను ఇంటి నుంచే సులభంగా పూర్తి చేయవచ్చు. ముందుగా Employees' Provident Fund Organisation యూనిఫైడ్ పోర్టల్లోకి వెళ్లి, యూఎఎన్ మరియు పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ‘Manage’ ట్యాబ్లోని ‘KYC’ ఎంపికను క్లిక్ చేసి, ‘Aadhaar’ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్, పేరు నమోదు చేసి, ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేస్తే రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. యజమాని ఆమోదించిన తర్వాత లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.వివరాలు సరిపోక లింక్ రిజెక్ట్ అయితే, ‘Modify Basic Details’ ద్వారా ముందుగా వివరాలు సవరించుకోవాలి. డేటా అప్డేట్ అయిన తర్వాత మళ్లీ లింక్ చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల పీఎఫ్ ఖాతా భద్రత పెరగడమే కాకుండా, పెన్షన్ సేవలు కూడా సులభతరం అవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa