క్రికెట్ మ్యాచ్లలో ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ను నిష్పక్షపాతంగా నడిపించే బాధ్యత పూర్తిగా వారి మీదే ఉంటుంది. వైడ్లు, నోబాల్స్, బౌండరీలు, ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు తీసుకోవడం నుంచి ప్రతి బంతిని ఖచ్చితంగా లెక్కించడం వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. మ్యాచ్ ముగిసే వరకు మైదానంలోనే ఉండి తమ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇంతటి బాధ్యతలు ఉన్న అంపైర్లకు ఎంత పారితోషికం అందుతుందో చాలామందికి తెలియదు. అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి దేశీయ టోర్నీల వరకు, ఐపీఎల్ వరకు వారి జీతాలు ఎలా ఉంటాయో చూద్దాం.అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లకు మంచి పారితోషికం లభిస్తుంది. టెస్ట్ మ్యాచ్కు సుమారు రూ.4 లక్షలు ఐసీసీ చెల్లిస్తుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్లో అంపైర్లు నిరంతరం విధులు నిర్వర్తించాలి. వన్డే మ్యాచ్కు సుమారు రూ.2.5 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.1.25 లక్షలు అందుతుంది. మ్యాచ్ ఫార్మాట్ను బట్టి ఈ చెల్లింపులు మారుతూ ఉంటాయి.దేశీయ క్రికెట్ మ్యాచ్లలో కూడా అంపైర్లకు మంచి ఆదాయం ఉంటుంది. గ్రేడ్ A+, A కేటగిరీ అంపైర్లకు సుమారు రూ.1.6 లక్షల వరకు చెల్లిస్తారు. గ్రేడ్ B, C అంపైర్లకు సుమారు రూ.1.2 లక్షలు అందుతుంది. నాకౌట్ మ్యాచ్లకు అయితే రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పారితోషికం ఉంటుంది.ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంపైర్లకు ఇంకా అధిక పారితోషికం లభిస్తుంది. మైదానంలో మ్యాచ్ నిర్వహించే ఆన్ఫీల్డ్ అంపైర్లకు ఒక్క మ్యాచ్కు సుమారు రూ.3 లక్షలు చెల్లిస్తారు. ఫోర్త్ అంపైర్కు దాదాపు రూ.2 లక్షలు అందుతుంది.మొత్తంగా చూస్తే అంపైర్ల బాధ్యతలు ఎంత కీలకమో, వారి పారితోషికం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మ్యాచ్ న్యాయంగా సాగేందుకు అంపైర్ల పాత్ర ఎంతో ముఖ్యమని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్లలో ఆటగాళ్లతో పాటు అంపైర్లకు కూడా గాయాల ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా స్ట్రైట్ డ్రైవ్ల సమయంలో ఆన్ఫీల్డ్ అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa