పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హర్మూజ్ జలసంధి మూతపడటంతో, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు తమ ఎగుమతులను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.కానీ నిపుణుల అభిప్రాయ ప్రకారం, ఈ ప్రత్యామ్నాయ మార్గాలు హర్మూజ్ జలసంధి సరఫరాకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కావు. ప్రపంచానికి వచ్చే చమురు రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెల్లు, అలాగే ఐదో వంతు సహజ వాయువు కేవలం హర్మూజ్ ద్వారా మాత్రమే రవాణా అవుతుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ సరఫరాను నిలిపివేసినందున, గల్ఫ్ దేశాలు ఇతర మార్గాలపై దృష్టి సారించాయి.సౌదీ అరేబియా పర్షియన్ గల్ఫ్ నుండి ఎర్ర సముద్ర తీరానికి చమురును పంపడానికి 'ఈస్ట్-వెస్ట్ పైప్లైన్'పై ఆధారపడింది. అయితే, దీని సామర్థ్యం రోజుకు 5–7 మిలియన్ బ్యారెల్లే, అంటే హర్మూజ్ ద్వారా వచ్చే సరఫరాకు కేవలం సుమారుగా మూడో వంతు మాత్రమే.యూఏఈ హర్మూజ్ అవసరం లేకుండా నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ద్వారా చమురును పంపడానికి 'హబ్షాన్-ఫుజైరా పైప్లైన్'ను ఉపయోగిస్తోంది. ఈ మార్గం భారత్, చైనా వంటి దేశాలకు సరళమైన రవాణా అవకాశాన్ని ఇస్తుంది, అయితే దీని సామర్థ్యం కేవలం 1.5–1.8 మిలియన్ బ్యారెల్లతో పరిమితం.ఇరాక్కు ఎర్ర సముద్ర మార్గం లేనందున, ఉత్తర ప్రాంతంలోని కిర్కుక్-సిహాన్ పైపులైన్ ద్వారా తుర్కీయాకు చమురు పంపాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ మార్గం కూడా పరిమిత సామర్థ్యంతోనే పనిచేస్తుంది.ఈ పరిస్ధితుల కారణంగా, గల్ఫ్ దేశాలు హర్మూజ్ జలసంధి మూతపడినప్పుడు కూడా చమురు సరఫరా కొనసాగించడానికి కొత్త మార్గాలను అన్వేషించడం తప్పనిసరి అవుతోంది.ఎర్ర సముద్రం ఎంతవరకు సురక్షితం?హర్మూజ్కు బదులుగా ఎర్ర సముద్రాన్ని వాడుకోవాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నా, అక్కడ కూడా ముప్పు పొంచే ఉంది. గతంలో గాజా యుద్ధం నేపథ్యంలో యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. హూతీల తిరుగుబాటుదారులు ఇరాన్కు మద్దతుగా ఉంటారు. దీంతో ప్రస్తుతం మౌనంగా ఉన్న హూతీలు ఏ క్షణమైనా రంగంలోకి దిగొచ్చు. గల్ఫ్ దేశాలు ఎర్ర సముద్రాన్ని ప్రత్యామ్నాయంగా వాడటం మొదలుపెడితే, ఇరాన్ ఆదేశాలతో హూతీలు మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంది.కువైట్, ఖతార్ వంటి దేశాలు పూర్తిగా హర్మూజ్ పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత పైప్లైన్ల సామర్థ్యం తక్కువగా ఉండటం, మరోవైపు ఎర్ర సముద్రంలో హూతీల భయం వెరసి.. ప్రపంచ చమురు మార్కెట్కు మున్ముందు మరిన్ని గడ్డు రోజులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa