ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 12:23 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రజావేదిక కూల్చివేత పనులు మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయానికి 70 శాతం కూల్చివేత పూర్తయింది. ఇవాళ సాయంత్రానికి కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. నిన్న సాయంత్రమే కరకట్టను ఆధీనంలోకి తీసుకున్న అధికారులు.. ప్రజావేదికలోని సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న రైతులను, టీడీపీ కార్యకర్తలను పోలీసులు తిరిగి పంపించారు. 


ప్రజావేదిక కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు నిన్న రాత్రి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలు చేశారు. ప్రజా వేదిక అక్రమ నిర్మాణమేనంటూ తన వ్యాజ్యంలో పలుమార్లు పేర్కొన్నారు పిటిషనర్‌. దీంతో ఈ భవనం అక్రమమా? కాదా? అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. అక్రమమేనంటూ పిటిషనర్‌ అంగీకరించారు. అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలను కోర్టు పూర్తిగా సమర్థించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa