తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీజేపీ మధ్య పొలిటికల్ కోల్డ్వార్ నడుస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రం ఏపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తోందని, తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయడం లేదనే చర్చ జరగలేదా ప్రశ్నించారు. బీజేపీ వైఖరిని ఇద్దరు సీఎంలు తప్పుపట్టి ఈ వెంటనే వెనక్కి తగ్గడం మడమ తిప్పడం కాదా అని యనమల నిలదీశారు. ఇద్దరు సీఎంలు కేంద్రంపై ధ్వజమెత్తిన మాట వాస్తవమన్నారు. తీరా అది బైటపడేసరికి నాటకం ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ప్రెస్మీట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 9 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. తెలంగాణ మేలు కోసమో.. లేదంటే ఏపీకి అన్యాయం చేయడానికా అని యనమల ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa