ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మంచి మనసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 05:33 AM

అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి వైద్యసాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయించారు వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా. అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతికి సంబంధిత డాక్యుమెంట్లు అందజేస్తున్న ఫొటోను రోజా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఎమ్మెల్యే చేసిన మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంచి పని చేశారంటూ ఆమె ప్రశంసలు గుప్పిస్తున్నారు. శుక్రవారం నాడు రోజా మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పింక్ బస్సును ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అధునాతన టెక్నాలజీతో ఈ పింక్ బస్సును రూపొందించింది. స్విమ్స్ మహిళా వైద్య బృందం గ్రామంలోని 40 ఏళ్లు పైబడిన మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన తక్కువగా ఉంటోంది. దీంతో వ్యాధిని గుర్తించే సరికే అది ముదురుతోంది. దీంతో చికిత్స కష్టమై ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ముందుగానే వ్యాధిని నిర్ధారిస్తే.. క్యాన్సర్ చికిత్సకు లొంగుతుంది. ఆ ఉద్దేశంతోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం ఇరుగువాయి గ్రామంలోనూ రోజూ పింక్ బస్సును ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa