ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా స్వేచ్ఛ కోసం పోరాటంలో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అనారోగ్య కారణాలరీత్యా తాను హాజరుకాలేకపోయానని తెలిపారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్రగాయమైందని.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొంటూ అశ్రద్ధ చేయడం వల్ల ఆ గాయాలు మళ్లీ ఇప్పుడు తిరగతోడుతున్నాయని తెలిపారు. ఆ నొప్పితో బాధపడుతుండటం వల్లే ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కల్యాణ్.. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున, వ్యక్తిగతంగా తన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్స్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చినప్పటికి, సంప్రదాయ వైద్యంపై ఉన్న నమ్మకంతో ఆ దిశగా వెళుతున్నాను అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa