ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ఝ‌ల‌క్‌- ప్లాట్ ఫామ్ టిక్కెట్టు రూ.30ల‌కు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 02:25 AM

దసరా పండుగ సందర్భంగా  రద్దీ దృష్ట్యా రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్లు భారీగా పెంచాల‌ని నిర్ణ‌యించింది రైల్వే శాఖ‌. ఇప్పటి వరకు రూ.10 లుగాఉన్న  ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధ‌ర‌ని పండుగ సీజన్ అంటూ ఏకంగా రూ.30కి పెంచారు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఇదే ధర అమ‌లులో ఉంటుందని, తర్వాత నుంచి మళ్లీ పాత రేట్లు అమలు చేస్తార‌ని రైల్యేవ‌ర్గాలు చెపుతున్నాయి. ప్లాట్ పామ్ టిక్కెట్ల ధరలు పెంచడంవల్ల రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చునని   పేర్కొన్నాయి.  పెంచిన టికెట్ ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa