ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరి మాట వినని సీతయ్య టైపు జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 02:17 AM

 ఇసుక కొరత లేదంటున్న మంత్రి పెద్దిరెడ్డి.. అసలు ఇసుక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని డిమాండ్ చేసారు.  సీపీఐ నేత రామకృష్ణ  సోమ‌వారం  విశాఖ‌ప‌ట్నంలోని ముడసర్లోవ ప్రభుత్వ ఇసుక డిపోను సీపీఐ బృందం తో పాటు ఆయ‌న‌ సందర్శించి ప‌రిశీలించారు.. ఈ సందర్భంగా   రామకృష్ణ మాట్లాడుతూ. ఎవరి మాట వినని సీతయ్య టైపు జగనని ఎద్దేవా చేశారు. ఇసుక పంపిణీలేక జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌లు  పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని, అయితే కొత్త ఇసుక పాలసీ పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేసారు. ప్ర‌భుత్వం చెప్పిన దానికి వాస్త‌వ ప‌రిస్థితికి పొంత‌నే లేద‌ని ఇప్ప‌టికైనా స్పందించి  ఇసుక అందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలని లేని ప‌క్షంలో త‌మ పార్టీ ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేసారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa