ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సుప్రీం లో చుక్కెదురు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 01:31 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్ కేసులో ఫడ్నవిస్‌ను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద ప్రాసిక్యూట్ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారంనాడు అనుమతించింది.


ఫడ్నవిస్ 2014 ఎన్నికల అఫిడిట్‌లో క్రిమినల్ కేసులను చేర్చలేదంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ధ బోస్‌తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ కేసులో ఫడ్నవిస్‌కు విచారణ కోర్టు, ముంబై హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన 'క్లీన్ చిట్'ను ధర్మాసనం తోసిపుచ్చింది. తప్పుడు అఫిడవిట్ అనేది చట్టప్రకారం ఆంగీకారయోగ్యం కాదని, ఆ ప్రకారం దిగువ కోర్టుల తీర్పును కొట్టివేస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది. దీంతో తప్పుడు అఫిడవిట్ కేసులో ఫడ్నవిస్ తాజా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. పిటిషనర్ సతీష్ యుకీ దాఖలు చేసిన ఫిర్యాదును తిరిగి పరిశీలించాలని కూడా విచారణ కోర్టును సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. కాగా, ఈనెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa