ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే జగన్ ప్రభుత్వం కూడా చెబుతోంది: సుజనా చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 04:17 PM

రెవెన్యూ లోటుపై గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రం నిరాధారమైనదని అన్నారు. జగన్ ఇప్పటినుంచే ఓట్ల రాజకీయం ప్రారంభించారని ఆర్థమవుతోందని విమర్శించారు. పోలవరం పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తిగా ఉందని సుజనా తెలిపారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్టు పోలవరం టెండర్లు పిలిచారని వ్యాఖ్యానించారు. రాజధానిలో రూ.9 వేల కోట్ల పనులు జరిగితే రూ.30 వేల కోట్ల దుబారా ఎలా సాధ్యమని అడిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa