కేరళలలోని ఓ చర్చి బిషప్ తనపై రెండేళ్ల పాటు అఘాయిత్యాని పాల్పడ్డాడంటూ ఓ నన్ చేస్తున్న న్యాయపోరాటంలో తాజాగా బెయిల్ పై వచ్చిన బిషప్ తిరిగి తన వ్యక్తిత్వాన్ని అగౌరవపర్చే విధమైన చర్యలకు పాల్పడుతున్నాడని బాధితురాలైన నన్ అరోపిస్తొంది. తాజాగా నన్ చేసిన ఆరోపణలు కేరళలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయమై గురువారం ఆమె మీడియాలో మాట్లాడుతూ తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను తాజాగా బిషప్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అఘాయిత్యం నేపథ్యంలో తమ మధ్య జరిగిన సంబాషణలను కూడా బిషప్ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడం.. వాటిని వీక్షకులందరికీ అందుబాటులోకి ఛానెల్ తీసుకురావడంపై కూడా అమె అక్షేపణలు వ్యక్తం చేసారామె. బిషప్ కావాలని తన వ్యక్తిత్వంపై, క్యారెక్టర్ ను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసారు. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.
ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు ఇచ్చిన అదేశాలను తుంగలో తొక్కుతూ.. పలు వైబ్ సైట్లు తన వ్యక్తిగత వివరాలతో పాటు తన ఫోటోలను కూడా ప్రచురించాయని అమె అరోపించారు. అత్యాచారం జరిపిన బిషప్ పై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాల్సిన వారు.. ఇలా చేయడంపై అమె పలు ప్రశ్నలు సంధించారు.
బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసు విషయంలో ఏర్పాటు చేసిన సిట్ న్యాయస్థానంలో చార్జిషీటును దాఖలు చేసిందని, నవంబర్ 11 నుంచి ఈ కేసులో ట్రయల్ ప్రారంభమవుతుందని ఎస్ఓఎస్ అధికార ప్రతినిధి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa