ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌ మాజీ సిఎం దీలీప్‌ పారిఖ్‌ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 01:41 PM

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి దిలీప్‌ పారిఖ్‌ మృతి చెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పారిఖ్‌ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1997 అక్టోబర్‌నుంచి 1998 మార్చి మధ్య కాలంలో గుజరాత్‌కు 13వ ముఖ్యమంత్రిగా పారిఖ్‌ బాధ్యతలు నిర్వహించారు. శంకర్‌ సింగ్‌ వఘేలా బిజెపిని చీల్చి స్థాపించిన రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెపి) సభ్యుడిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పారిఖ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa