రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో మరో 20 ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్టుకోస్టు రైల్వే అధికారులు నిర్ణయించారు. దేశంలోని ప్రధాన నగరాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని వివిధ స్టేషన్ ల నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్ లో సున్నా లేదా 8 నంబరుతో ప్రత్యేక రైలు నంబర్లు ప్రారంభమవుతాయని అధికారులు వివరించారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ఐదు లక్షల మంది ప్రయాణికులకు అవసరమైన బెర్తులు లభిస్తాయి.
ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరు, హౌరా, చెన్నై, అలహాబాద్, పాట్నా, భాగల్పూర్ నగరాలకు ఎక్కువ రద్దీ ఉంటుందని, ఈ రూట్లపై దృష్టిసారిస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతోపాటు సాధారణ రైళ్లలోనూ బోగీల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని రైల్వే అధికారులు చెప్పారు. పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వస్తే ప్రత్యేక రైళ్లలో టికెట్లు తీసుకోవచ్చని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa