ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వదులుకొనేందుకు టీడీపీ సిద్ధంగా లేదని ఆయనతో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ చేసిన పోరాటాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందని, ఆయనది టీడీపీ డీఎన్ఏ అని అన్నారు. ఆయన లాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదన్నారు. వంశీ తరఫున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని కేశినేని నాని అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయనను బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దింపారు. వంశీని బుజ్జగించడంతో పాటు రాజీనామాకు దారితీసిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa