ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరేళ్ల కూతురిని హత్యచేసిన కన్నతల్లి

national |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 01:50 PM

ముంబైలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొడుకు కావాలన్న బలమైన కోరికతో ఓ తల్లి తన ఆరేళ్ల కన్నకూతురిని కిరాతకంగా హత్య చేసింది. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమెను కళంబోలి పోలీసులు అరెస్ట్ చేశారు.కళంబోలి ప్రాంతంలోని గురు సంకల్ప్ సొసైటీలో నివసించే సుప్రియా మహామున్కర్ (30) ఈ నెల 23న తన కుమార్తె మాన్సి (6) అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులకు తెలిపింది. అయితే, పాప మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఊపిరాడకుండా చేయడం వల్లే చిన్నారి చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.అనంతరం సుప్రియను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించింది. కొడుకు పుట్టాలనే కోరికతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకుంది. అంతేకాకుండా, తన కూతురి మాటలు స్పష్టంగా లేవని, మరాఠీ కాకుండా హిందీ మాట్లాడుతోందని కూడా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. నిందితురాలు 2024 నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.2019లో పాప నెలల వయసులో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించిందని ఆమె భర్త ప్రమోద్ పోలీసులకు చెప్పడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa