ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం షురూ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 12:37 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేటి నుంచి షురూ అయింది. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సుల్లో సింగిల్ జర్నీ ట్రావెల్ పాసుల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఢిల్లీ ప్రభుత్వం అందిస్తుంది. ‘ఇది మంచి పరిణామం. టికెట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఎంతో బాసటగా నిలుస్తుందని’ ఢిల్లీ వాసి అయిన శ్వేతా అనే మహిళ పేర్కొంది. ‘ఈ నిర్ణయం మాకు మాత్రం చాలా మంచి విషయం. కానీ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. బస్సులు సరైన సమయానికి వస్తే ఈ నిర్ణయం తీసుకున్నందుకు తమకు ఉపయోగకరంగా ఉంటుందని' శాంతి అనే మరో మహిళ తెలిపింది. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. మహిళల భద్రత కోసం ఢిల్లీ బస్సుల్లో ఇప్పటికే సుమారు 13 వేల మంది మార్షల్స్ ను కూడా నియమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa