ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాకు ఉగ్ర ముప్పు మెయిన్ టార్గెట్‌ గా కోహ్లీ...!

national |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 03:03 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఓ అనామక లేఖ అందింది. కోహ్లీతో పాటు బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి సిరీస్ ఆడనున్న భారత క్రికెట్ జట్టు మొత్తానికి ప్రమాదం ఉందని ఎన్‌ఐఏ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టీ20లో తలపడనుండగా.. ఆరోజు భారత క్రికెటర్లపై దాడి చేయబోతున్నట్లు బెదిరింపు లేఖలో ఉందని బీసీసీఐకి ఎన్‌ఐఏ సమాచారం అందించింది. ఢిల్లీ పోలీసులు అనామక లేఖని బీసీసీఐ సెక్యూరిటీ ఏజెన్సీకి పంపి జట్టు భద్రతని సమీక్షించుకోవాలని సూచించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మ్యాచ్‌ని చూసేందుకు వచ్చే రాజకీయ ప్రముఖులు తమ మెయిన్ టార్గెట్‌ అని ఆ లేఖలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఆల్ ఇండియా లష్కర్ ముఠా నుండి ఈ లేఖ అందినట్టు తెలుస్తోంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు భద్రతను కట్టుదిట్టం చేయాలని భారత హోంమంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులను బీసీసీఐ కోరింది. ఇప్పటి నుండే పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న కోహ్లీ భద్రతపైనా అధికారులు దృష్టి సారించారు. అలానే భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్ల భద్రతనీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa