ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 04:49 PM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం బోధన జరగాలని, అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్లను కోరారు.. తాడేపల్లి నుంచి  జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, స్పందనలో రాష్ట్రంలో 6,99,548 ఆర్జీలు వచ్చాయని వాటి పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయాలని కోరారు. డిసెంబరు 15 నాటికి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయుటకు సిద్దం చేయాలన్నారు.  నవంబర్ 1వ తేదీ నుండి ఆరోగ్య శ్రీ క్రింద ఇతర రాష్ట్రాలలో 131 ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన 500 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో  నవంబర్ 20 నాటికి ఉంచాలని కోరారు.  నవంబర్ 7న రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.69, 665 మంది  అగ్రిగోల్డ్ బాధితులకు ఖాతాల్లో జమ చేయాలని, దీనికోసం రూ.265 కోట్లను విడుదల చేసినట్లు జగన్ తెలిపారు. వేట నిషేధం సమయంలో గతంలో రూ.4 వేలు ఇచ్చిన నష్టపరిహారంను ఇకపై రూ.10 వేలు పెంచుతున్నట్లు జగన్ చెప్పారు.. దీనివల్ల  రాష్ట్రంలో 1,31,332 కుటుంబాలకు లబ్ది చేకూరనుందన్నారు.  డిసెంబరు 3వ తేదీన యువ న్యాయవాదులకు 3 సంవత్సరాల పాటు సహాయం అందించే వై యస్ ఆర్ లా పథకంలో భాగంగా  రూ అయిదు వేలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.. వచ్చే ఏడాది ఉగాది నాటికి 22.69 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్1వ తేదీన నిర్వహించాలని కోరారు..ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో చాలా పారదర్శకంగా ఇసుక ప్రక్రియ జరుగుతుందన్నారు.. వరద ఉన్నప్పటికీ 6 రీచ్ లను గుర్తించామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, డిఆర్ఓ బలివాడ దయానిధి, నగర పాలక సంస్థ కమీషనర్ ఎం.గీతా దేవి, ఆర్డీవో ఎం.వి.రమణ, జెడ్పీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.చక్రధర రావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన్ రావు, మత్స్య శాఖ జెడి డా.వివి కృష్ణ మూర్తి, గనుల శాఖ డిడి ఎస్.కె.వి.సత్యనారాయణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాధ రావు, డిబిసిఎస్ పి.ఓ డా.ఎం.రమణ కుమార్, డిఇఓ కె. చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa