ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పూర్తి బాధ్యత అథారిటీదే: ట్రిబ్యునల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 06:07 PM

పోలవరం పూర్తి బాధ్యత పోలవరం అథారిటీదేనని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పోలవరం పునరావాసం, డంపింగ్ అంశాలపై ఎన్జీటీ లో విచారణ జరిగింది. ఎన్జీటీ ముందు పోలవరం మెంబర్ సెక్రటరీ బిపి పాండే, పోలవరం ఎస్ ఈ నాగిరెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సందించింది. కాపర్ డ్యాం నిర్మిస్తున్నప్పుడు పునరావాసం ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. కాపర్ డ్యాం వల్ల ముంపు వాటిల్లిన మాట వాస్తవమేనని, ప్రజలను ముందుగానే వేరే ప్రాంతాలకు తరలించామని, వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని నివేదించారు. జాతీయ ప్రాజెక్టును ఇంత అధ్వాన్నంగా నిర్మిస్తున్నారు ఏమిటి అని ప్రశ్నించింది. కాపర్ డ్యాం నిర్మాణం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సభ్యులతో కమిటీ తదుపరి విచారణ ఫిబ్రవరి 14 కు వాయిదా వేసినట్టు తెలిపారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa