ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 06:15 PM

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అయితే వైసీపీ టార్గెట్ చేసిన నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని, ఇది ఖచ్చితంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటమేనని మండిపడుతున్నారు.
అయితే తాజాగా జగన్ పాలనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశముందని అన్నారు. అంతేకాదు జగన్ పాలన హద్దు మీరి ప్రవర్తిస్తున్నట్టు ఉందని, కేసులంతో భయపెట్టి తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారి పార్టీలో చేరితే కేసులేమి ఉండవని అంటున్నారని చెప్పుకొచ్చారు. అధికారులు కూడా ప్రభుత్వం చెప్పినట్టే వినాలని, లేకపోతే ఏపీ సీఎస్ మాదిరి బదిలీ చేసి పంపుతారని అధికారులు భయపడుతున్నారన్నారు. గత 74 ఏళ్ళుగా తనకు ట్రాన్స్‌పోర్ట్‌లో అనుభవం ఉందని కక్ష్య కట్టి మా ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa