టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. మెమరీ చిప్స్ ధరలు పెరిగిన కారణంగా వచ్చే 2 నెలల్లో 4-8% పెరగొచ్చని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. చిప్స్ రేట్లు ఇప్పటికే 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50%, తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల ధరలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఈ ఏడాది 30%పైగా పెరగొచ్చని నథింగ్ సీఈవో అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa