ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగదు అక్రమ చలామణి కేసులో మెహుల్‌ చోక్సీ కుమారుడు రోహన్‌ చోక్సీ: ఈడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 16, 2026, 12:07 PM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన మెహుల్‌ చోక్సీ మనీలాండరింగ్‌ కేసులో అతడి కుమారుడు రోహన్‌ చోక్సీ పాత్ర ఉందని ఈడీ వెల్లడించింది. మెహుల్‌ డైరెక్టర్‌గా ఉన్న లస్టర్‌ ఇండస్ట్రీస్‌లో రోహన్‌కు 99.99 శాతం వాటా ఉందని, కంపెనీ నిధులను విదేశాలకు మళ్లించారని తెలిపింది. నగదు అక్రమ చలామణిలో రోహన్‌ చురుకుగా పాల్గొన్నట్టు ఆధారాలున్నాయని పేర్కొంది. అతడి ఆస్తులను అటాచ్‌ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు, అవసరమైతే కుటుంబసభ్యులను కూడా విచారిస్తామని ఈడీ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa