ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లక్ష్యం 154

national |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 10:31 PM

టీ20 సిరీస్ లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో బంగ్లా, టీమిండియాకు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా జట్టకు ఓపెనర్లు లిటల్ దాస్(29), మహ్ముద్ నయీమ్(36)లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్(30), మహ్మద్దుల్లా(30)లు మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. మొదట్లో తేలియపోయిన భారత బౌలర్లు చివరి 10 ఓవర్లలో లైన్ అండ్ లెన్త్ బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్లను కట్టడిచేశారు. దీంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. భారత బౌలర్లలో యుజ్వేందర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ లు తలో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa