అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టు షాకిచ్చింది. ట్రంప్ ఫౌండేషన్కు వచ్చిన నిధులను 2016 అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకున్నారని ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఫౌండేషన్ నిధులను ట్రంప్ దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లిటిటియా జేమ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను విచారించిన మన్హట్టన్ స్టేట్ సుప్రీం కోర్టు.. న్యాయమూర్తి సాలియన్ స్కార్సుల్లా నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు. తన సొంత ఛారిటబుల్ ఫౌండేషన్ నిధులను రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవటం సరికాదని రెండు మిలియన్ డాలర్ల ఫైన్ విధిస్తూ, ఈ మొత్తాన్నిస్వచ్ఛంద సంస్థలకు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.
త విషయమై ట్రంప్ మాట్లాడుతూ నాలుగేళ్ల రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఫౌండేషన్ చేసిన చిన్న సాంకేతిక తప్పిదాల కారణంగా రెండు మిలియన్ డాలర్లను ఛారిటీకి ఇవ్వడానికి కోర్టుతో ఒప్పందం కుదిరిందన్నారు. క్లింటన్ ఫౌండేషన్కు సంబంధించి విచారణ జరపకుండా తిరస్కరించారని ట్రంప్ విమర్శించారు.
నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో (19 మిలియన్ డాలర్లు) విరాళం ఇచ్చింది నేను మాత్రమేనన్న ట్రంప్.. న్యూయార్క్ అటార్నీ జనరల్ తనపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారన్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు మరోమారు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని ట్రంప్ ప్రకటించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa