బంగారం ధరలు శనివారంమరింత క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్కు 0.46 శాతం తగ్గుదలతో 1,459.60 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 1.44 శాతం క్షీణతతో 16.76 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గిందని. దీంతో ధర రూ.39,650కు దిగొచ్చిందని ట్రేడర్లు చెపుతున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.230 తగ్గింది. దీంతో ధర రూ.36,350కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా పడింది. రూ.150 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,600కు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది. దీంతో ధర రూ.38,370కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గుదలతో రూ.37,100కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.150 క్షీణించింది. దీంతో ధర రూ.48,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa