ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతూనే ఉంది. తాజాగా ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నవారిని కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, డీజీపీల తరహాలోనే సీఎస్లను కూడా రెండేళ్లు పదవిలో కొనసాగించాలని కృష్ణారావు తెలిపారు. ఇదే సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ విషయాన్ని పిటిషన్లో వెల్లడించారు.
ఈ పిటీషన్లో ఐవిఆర్ ప్రతివాదులుగా ఏపీ ఇన్ఛార్జ్ సీఎస్ నీరభ్ కుమార్, జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర కేబినెట్ సెక్రటరీ, డీవోపీటీ కార్యదర్శులను పేర్కొన్నారు. కృష్ణారావు పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa