పొదిలి తహసీల్దార్పై సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణాకు చెందిన ఏ.ఆర్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి చర్యలు తీసుకోవాలని పొదిలి మండల డిప్యూటీ తహసీల్దార్ రఫి కోరారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి తహసీల్దార్ జె.ప్రభాకరరావును బుధవారం సోషల్ మీడియాలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నీ పద్దతి మార్చుకోకుంటే నీకు తెలంగాణాలో అబ్దుల్లాపుర్మెట్లో తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన పెట్రోలు దాడి పునరావృతం అవుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ విషయంపై తహసీల్దార్ జె.ప్రభాకరరావు బుధవారం పొదిలి ఎస్సై కె.సురేష్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. వెంటనే బాధ్యునిపై కేసు నమోదు చేసి తగుచర్యలు తీసుకోవాలని పొదిలి మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. మాకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అభద్రతా భావంతో పనులుచేయాల్సి వస్తోందని తెలిపారు. కించపరిచి, బెదిరించిన వారిని వెంటనే శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అలా జరగని పక్షంలో సామూహిక సెలవులు పెట్టి విధులు బహిష్కరిస్తామని, రెవిన్యూఉద్యోగుల సంఘం తరపున వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, విఆర్ఓలు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa