2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం ఉందని, దేశంలో 27శాతం ఉందని, ఈ దారిద్యం పోవాలంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడుతూ.. ఒక దీపం గదికి వెలుగునిస్తే.. చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుందన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలపైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్కల్యాన్ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారన్నారు. పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారన్నారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్న.. చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు. పవన్ కల్యాన్ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు?. పిల్లల్ని మంచి చదవులు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు. పిల్లలకి ఉన్నత చదవులు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణమని జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa