ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తాము : పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 04:02 PM

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన పార్టీ అచితూచి స్పందిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారని, వారి నిర్ణయం తర్వాతే తాము మాట్లాడతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని తాము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదని, అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa