ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ పరిస్థితి శ్రేయస్కరం కాదని జనసేన పార్టీ తరపున ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేశారు. ‘‘కమిటీ నివేదికపై కేబినెట్లో సమగ్రంగా చర్చిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయం తర్వాత ఈ విషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తాం. ఆ తర్వాత జనసేన పార్టీ నిర్ణయాన్ని ప్రజలముందు ఉంచుతాం. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులు ఏర్పాటు చేయడం. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేదిగా ఉండాలని జనసేన ఆశిస్తోంది. అంతే తప్ప అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలనో లేక నాలుగు భవనాలుగానో భావించడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది. వెనుకబడిన ప్రాంతాల తక్షణ అభివృద్ధిని, రాజకీయ జవాబుదారీతనాన్ని జనసేన కోరుకుంటోంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa