జార్ఖాండ్ ఫలితాలు బీజేపీకి షాక్ ఇవ్వనున్నాయా..? దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ చేతుల్లోంచి జార్ఖాండ్ జారిపోనుందా..? కాంగ్రెస్-జేఎంఎం, ఆర్జేడీ కూటమి అత్యధిక స్థానాలు దక్కించుకోనుందా..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రేపటి జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలనుంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి… జార్ఖండ్ రూపంలో షాక్ తగలనుందా. అక్కడ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలేనా..? కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి అధిక స్థానాలకు కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ప్రశ్నలకు రేపటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.
జార్ఖండ్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. జార్ఖండ్లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22 నుంచి 32 స్థానాలకే పరిమితం అవుతుందన్న సర్వేలు, కాంగ్రెస్-జేఎంఎం, ఆర్జేడీ కూటమికి 38 నుంచి 50 సీట్లను సొంత చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. ఇదిలాఉంటే.. కొన్ని సంస్థలు జార్ఖాండ్ లో హంగ్ వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యే మద్దతు అవసరం. ఎగ్జిట్పోల్స్ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన సీఎం రఘుబర్ దాస్ మాత్రం విజయంపై ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తామే అధికారాన్ని చేపడతామని స్పష్టం చేశారు.
అంచనాలు ఎలా ఉన్నా.. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేజిక్ ఫిగర్ 41కి ఎవరు చేరుతారు, ఎవరికి ప్రజలు పట్టంకట్టారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాన పార్టీలు మేజిక్ ఫిగర్ను సాధించకపోతే.. హర్యానాలో మాదిరిగా ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి. అయితే జేజేపీ మద్ధతుతో బీజేపీ హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా.. మహారాష్ట్రలో మాత్రం గద్దెనెక్కలేకపోయింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అధికారం పోగొట్టుకున్న బీజేపీకి జార్ఖండ్లోనూ ఓడితే… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి.
ఇక, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా… వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa