జమ్ముకశ్మీర్లో ప్రశాంతత వాతావరణం నెలకొందని, అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని దీనంతటికి కారణం ఆర్టికల్ 370 రద్దేనని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనుకంజలో ఉండిపోయిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి జమ్ము, కశ్మీర్లు పురోగమించడం ప్రారంభించాయన్నారు. జమ్ముకశ్మీర్కు చెందిన పలువురు
విద్యార్థులు ఉపరాష్ట్రపతిని ఆయన నివాసంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పలు ట్వీట్లు చేశారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల ఒక తరం తెలివైన స్థానిక యువత అవకాశాలను కోల్పోయిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేందుకు మేము అంగీకరించలేదని, త్వరితగతిన ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఆర్టికల్ 370 రద్దు ఎంతో అవసరమని, జమ్ముకశ్మీర్ దేశానికి కిరీటంలాంటిది, మంచు పర్వతాలు, పచ్చని లోయలు, నదీప్రవాహాలు వంటి వాటితో ఎంతో ఆహ్లాద భరితమైన వాతావరణం ఆ ప్రాంతం సొంతమన్నారు. ప్రజల స్నేహపూర్వక స్వభావం, ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, వంటకాలు, సంస్కృతి, సంగీతానికి కశ్మీర్ ఎంతో ప్రసిద్ధి చెందిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ విద్యార్థులను దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు తీసుకొచ్చిన భారత ఆర్మీని ఆయన అభినందించారు. ఈ పర్యటన విూకు గుర్తుండిపోతుందని, విూరు దేశంలో వేగవంతమైన మార్పులను చూడబోతున్నారని, వాటి ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయని విద్యార్థులనుద్దేశించి ఉపరాష్ట్రపతి మరో ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa