అమరావతి రాజధాని మార్పు పై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని, వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు . అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుంది అని చెబుతున్నారు. అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నా అభిప్రాయమని, ఇంకా రాజధాని పై పూర్తిగా క్లారిటి రాలేదని తెలిపారు.
క్యాబినెట్ లో ఆమోదం, అసెంబ్లీ లో ఆమోదం జరిగితే కానీ రాజధాని మార్పు పై స్పష్టత రాదని, అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరగదనే నేను భావిస్తున్నానన్నారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి కనుక మాకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదని నా వ్యక్తిగత అభిప్రాయమని, అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇదని, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందింది దానితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతి అభివృద్ధి ఏ మాత్రం తగ్గదని, అమరావతిలో అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం కూడా జరిగిందని తెలిపారు మంత్రి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa