ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం తగదు: మాధవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 05:04 PM

ఏపీ రాజధాని అమరావతిని మార్చాలంటూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం తగదని శాసనమండలి సభ్యుడు పి . వి . ఎన్ . మాధవ్ విమర్శించారు . బీజేపీ నగర కార్యాలయంలో ఆయన్ని రాజధాని ప్రాంత గ్రామాల రైతులు కలిశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి మార్చటం సరైన విధానం కాదని పేర్కొన్నారు . భూసమీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని , ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కొల్పోతే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు . భవిష్యత్తులో భూములు ఇవ్వాలంటేనే రైతులు భయపడాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు . రాజధాని నిర్మాణానికి రైతులు 38వేల ఎకరాల భూమిని ఇచ్చారని , వారందరికీ బిజెపి అండగా ఉంటుందని స్పష్టం చేశారు . రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి రాజధాని పైనే చర్చ చేయటం అభివృద్ధికి విఘాతమని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించినట్లుగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa