ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలిని కొనసాగించాల్సిన అవసరముందా?: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 04:34 PM

శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్‌ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతును అందరమూ చూశామన్నారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘గ్యాలరీల్లో టిడిపి అధినేత చంద్రబాబు కూర్చొని జారీ చేసిన ఆదేశాలు చూస్తే మండలి చైర్మన్ నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని సభ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. తప్పు అని తెలిసినా.. తప్పు చేస్తున్నానని మండలి చైర్మన్ వ్యాఖ్యానించారని సీఎం జగన్‌ అన్నారు. ‘‘మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మా ప్రశ్న. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా? అని ప్రశ్నించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa