ఫిబ్రవరి 2న బీజేపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి రైతులకు మద్దతుగా తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తానని ఇటీవల ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే లాంగ్ మార్చ్ వాయిదా వేస్తున్నట్లు ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఎందుకు లాంగ్ మార్చ్ వాయిదా వేస్తున్నారో మాత్రం తెలియపరచలేదు. త్వరలో రాజధాని మార్పుపై బీజేపీ, జనసేనల కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa