ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ను కలవరపెడుతున్న కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 01:04 PM

భారత్ లో శుక్రవారం 7964 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 82,369 మంది కోలుకోగా 4971 మంది మరణించారు. ప్రస్తుతం 86,422 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 265 మంది మరణించారు. చైనా కంటే ఎక్కువ కరోనా కేసులు భారత్ లో ఉన్నాయి. అయితే ఒకే రోజు 265 మరణాలు సంభవించడం భారత్ ను కలవరపెడుతుంది. మహారాష్ట్రలో 62,228, తమిళనాడు 20,246,ఢిల్లీలో 17,386, గుజరాత్ లో 15,934 కరోనా కేసులున్నాయి. భారత్ లో ఒకే రోజు 265 మరణాలు సంభవించడం కలవరపెడుతుంది. ప్రతి రోజు భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa