ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎక్స్‌ఏఐ' సంస్థ కోసం మరో నూతన భవనాన్ని కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:52 PM

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఏఐ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఆయన స్థాపించిన 'ఎక్స్‌ఏఐ' సంస్థ తాజాగా అమెరికాలో మరో భారీ భవనాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే మెమ్ఫిస్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. అక్కడికి సమీపంలోనే మూడో భవనాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ కొత్త భవనానికి 'మాక్రోహార్డర్'  అని పేరు పెట్టినట్లు మస్క్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ కొనుగోలుతో తమ ఏఐ ట్రైనింగ్ కంప్యూటింగ్ సామర్థ్యం దాదాపు 2 గిగావాట్లకు చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఒక గిగావాట్ విద్యుత్ సుమారు 7.5 లక్షల ఇళ్లకు సరిపోతుంది. దీన్ని బట్టి మస్క్ ఏఐ డేటా సెంటర్ల సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిసిసిపీలోని సౌత్‌హెవెన్‌లో ఉన్న ఈ కొత్త భవనం.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 'కొలోసస్ 2' ఫెసిలిటీకి ఆనుకుని ఉంది. ఇప్పటికే మస్క్ మెమ్ఫిస్‌లో 'కొలోసస్' పేరుతో ఒక డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించాలన్నది మస్క్ లక్ష్యం. ఇందులో భాగంగా భవిష్యత్తులో 5,50,000 ఎన్విడియా చిప్‌లను వినియోగించనున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa